సర్వేపల్లి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ముత్తుకూరు మండలం, వల్లూరు గ్రామం నుంచి వెల్లంటి మహేష్ నాయుడుతో కలిసి తెలుగుదేశం పార్టీని వీడి 50 కుటుంబాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరారు. వారికి మంత్రి కాకాణి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని మంత్రి పిలుపునిచ్చారు.సర్వేపల్లి నియోజకవర్గం రోజురోజుకీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలమైన శక్తిగా తయారు కావడంతో తట్టుకోలేని సోమిరెడ్డి పిచ్చి ప్రేలాపనలకు దిగుతున్నాడు. సర్వేపల్లిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కాకాణి ఆధ్వర్యంలో దూసుకెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో సోమిరెడ్డి కొట్టు మిట్టాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ నాయకులే బాహాటంగా వెల్లడిస్తున్నారు. సోమిరెడ్డి వ్యవహారం దొంగే.. దొంగా.. దొంగా.. అన్నట్లుగా తాను మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్లకు కండువాలు కప్పి జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ... తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే వారిని మాత్రం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే కండువాలు వేసుకుంటున్నారంటూ ప్రచారం చేయడాన్ని చూసి గ్రామాలలోని తెలుగుదేశం నాయకులే టిడిపి క్యాడర్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళుతుంటే ఎవరిని మభ్యపెట్టడానికి సోమిరెడ్డి ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పాల్పడుతున్నాడంటూ ఆవేదన చెందుతున్నారు. సోమిరెడ్డికి గెలుపుపై ఆశలు లేవని, నియోజకవర్గంలో ఓడినా తన పెత్తనమే కొనసాగాలని పోటీ చేయడానికి ఆరాటపడుతున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa