దెందులూరులో నిర్వహిస్తున్న సిద్ధం సభలో జనసునామీ చూడబోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ఎకరాల్లోనే సభలు పెడుతుంటే జనం రాని పరిస్థితి ఉందని, కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పిలుపుతో 110 ఎకరాల్లో జరిగే సభకు లక్షలాది మంది తరలిరానున్నారని చెప్పారు. శనివారం మచిలీపట్నం నుంచి కార్యకర్తలతో కలిసి ఏలూరు సభకు పేర్నినాని బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివెళ్తున్నారని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలిరానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేశామన్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa