ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, వ్యాపారస్థులకు బిగ్ అలర్ట్. తాజాగా ఆదాయపు పన్ను శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నోటీసులు పంపించేందుకు ఐటీ శాఖ సిద్ధమవుతోంది. తమ ఆదాయంపై ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ కట్ అయినప్పటికీ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదో వారికి ఆదాయపు పన్ను శాఖ త్వరలోనే నోటీసులు పంపిస్తుందని తెలిపారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఛైర్మన్ నితిన్ గుప్తా. అలాంటి పన్ను చెల్లింపుదారులు 15 లక్షల మంది వరకు ఉంటారని తెలిపారు.
' సరైన సమాచారం అందించని పన్ను చెల్లింపుదారులకు మేము నోటీసులు పంపిస్తాం. అవి కొన్ని వేలల్లో ఉండవచ్చు. ట్యాక్స్ పేయర్స్ సర్వీసులు మెరుగుపరచడమే మా లక్ష్యం. రిఫండ్ టైమ్ తగ్గించడం నుంచి అప్డేటెడ్ రిటర్న్స్, లార్జ్ ట్యాక్స్ వివాదాల పరిష్కారం వరకు అన్నింటిపై ఫోకస్ చేశాం. రూ.1 కోటికిపైగా పన్ను వివాదాల పరిష్కారానికి కర్ణాటకలోని మైసూర్ లో డిమాండ్ మేనెజ్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. పన్ను చెల్లింపుదారులు అంగీకరించిన నిర్దిష్ట సమయంలో వారు ఒక చార్టర్డ్ అకౌంటెంట్, మందిపు అదికారులు, పన్ను చెల్లింపుదారులను ఒక చోట చేర్చుతారు. రెండు వైపులా అసెస్మెంట్, వివాదం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఈ కేంద్రం 2022లో ప్రారంభించగా.. ఇప్పటి వరకు 2,50,000 వివాదాలను పరిష్కరించింది. బడ్జెట్లో పేర్కొన్న రూ.25 వేల వరకు ఉన్న పాత ట్యాక్స్ డిమాండ్ల ఉపసంహరణపై సీబీడీటీ ఓ సర్క్యూలర్ జారీ చేయనుంది.' అని పేర్కొన్నారు సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా.
ఐటీ విభాగానికి అందిన పెద్ద మొత్తంలోని డేటాతో ఐటీ రిటర్న్స్ లో అసమతుల్యతను గుర్తించేందుకు సహాయపడుతుందన్నారు నితిన్ గుప్తా. దీని ద్వారా ట్యాక్స్ పేయర్స్ ఏదైనా సమాచారాన్ని మర్చిపోతే అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు సహాయపడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 51 లక్షల వరకు అప్డేటెడ్ రిటర్న్స్ ద్వారా రూ.4600 కోట్లు సమీకరించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 2022లో ప్రకటించిన కొత్త పన్ను విధానంలోకి 60 శాతం వరకు పన్ను చెల్లింపుదారులు మారినట్లు తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లేదా భారత ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు పన్ను చెల్లింపుదారుల నుంచి అదనపు సమాచారం కోరుతున్నట్లు గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa