హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఓ రేంజులో ఫైరయ్యారు. జగన్ మమ్మల్ని చూసి భయపడుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని పాతరేయడం ఖాయమని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు. అయితే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించి, నిరుద్యోగులను వైసీపీ సర్కారు మోసం చేసిందని ఆరోపించారు బాలకృష్ణ.
వైసీపీ పాలనలో ఏపీ అన్నిరంగాల్లో విఫలమైందని నందమూరి బాలకృష్ణ అన్నారు. నిరుద్యోగులను జగన్ సర్కారు నట్టేంట ముంచిందన్న బాలకృష్ణ.. పోలవరం ఊసే మరిచారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే ధైర్యం కూడా వైసీపీ ప్రభుత్వానికి లేదంటూ ఎద్దేవాచేశారు. సీఎం జగన్ మళ్లీ ప్రజల వద్దకు వచ్చి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని పాతరేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
అంతకుముందు సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ప్లకార్డులతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలపగా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకోవటంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వం పనైపోయిందంటూ విమర్శించారు. టీడీపీ నేతలను చూసి వైఎస్ జగన్కు భయం పట్టుకుందని అన్నారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలను అడ్డుకునే కొత్త సంప్రదాయాన్ని వైసీపీ ప్రారంభించిందని విమర్శించారు. ఆ తర్వాత బారికేడ్లను తోసుకుని టీడీపీ నేతలు అసెంబ్లీ చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa