ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెడుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సహా పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపేందుకు ఉదయం కేబినెట్ భేటీ నిర్వహించారు. అమరావతి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్నీ ఆమోదించారు.
ఇవాళ్టి కేబినెట్ భేటీలో ముందుగా 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించారు.అలాగే నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల పనిచేయనుంది. అటు నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు అనుమతి ఇస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చివరిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ఆమోదం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa