కడప జిల్లా, నిమ్మనపల్లిలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్ళితే.... మదనపల్లి మండలం చీకలబైలుకు చెందిన మండెం శ్రీనివాసులు భార్య గీతమ్మతో అదే పంచాయతి ఎగువ దొనబైలుకు చెందిన ప్రసా ద్తో పరిచయం ఏర్పడింది. దీంతో రోజు రోజుకు వారి మద్య సాన్నిహిత్యం మరింతపెరిగి వివాహేతర సంబంధానికి దారితీ సింది. దీనిపై గీతమ్మ భర్త శ్రీనివాసులు తరుచు గొడవపడేవా రు, ఈ క్రమంలో విషయాన్ని గీతమ్మ ప్రియుడు ప్రసాద్ కు చెప్పడంతో శ్రీనివాసులును అడ్డు తొలగించు కోవాలని పథకం పన్నారు. ఇదే విషయాన్ని గీతమ్మ ఎగువ దొన బైలులో ఉంటు న్న తండ్రి రామస్వామికి తెలిపింది, అనంతరం జనవరి 27న మద్యం మత్తులో తన ఇంటిలో నిద్రిస్తున్న భర్త శ్రీనివాసులును గీతమ్మ ప్రియుడు ప్రసాద్ బండతో తలపై బాది హత్య చేశాడు. అనతరం మృతదూహన్ని వారందరూ కలసి కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాతంలో పూడ్చి పెట్టారు. అనంతరం గీతమ్మ తన భర్త కనిపిండంలేదని గత నెల 27న పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో తాలూకా పోలీసులు అదృశ్యం కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా పోలీసులు తన దైన శైలిలో విచారణ చేపట్టడంతో నిందితులు అసలు విషయాన్ని అంగీకరించారు. ఇందులో భాగంగా శుక్రవారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో పోస్ట్మా ర్టం నిర్వహించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులైన ప్రసా ద్, గీతమ్మ, రామస్వామిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక ద్విచక్రవాహనం, 3సెల్ఫోనలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసు విచారణలో తాలూకా, వనటౌన, టూటౌన సీఐలు శేఖర్, వలీబసు, యువరాజు, ఎస్ఐలు వెంకటసుబ్బయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa