పర్చూరులో జరిగే ‘‘రా కదలిరా’’ సభను అడ్డుకోవాలని చూడడం పిరికిపంద చర్య అని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల సభలను అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమన్నారు. సైకో ఇజానికి ఇది ఒక నిదర్శనమన్నారు. చంద్రబాబు ఇప్పటి వరకు 20 రా కదలిరా సభలు నిర్వహించారన్నారు. 21వ సభను పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన 17వ తేదీన అనుకున్న ప్రదేశంలోనే రా కదలిరా సభ జరుగుతుందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa