రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం.. 'నాణ్యమైన విద్య అన్నది హక్కు' ఇది కొత్త నినాదమని, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి మెరుగైన ఉద్యోగాలు సాధించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో విద్యాశాఖ, ఎడెక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ఏపీలో చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. రైటు టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం. నాణ్యమైన విద్య అన్నది హక్కు ఇది కొత్త నినాదం. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం. మన విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యం. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి. అప్పుడే మన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్యలో మనం వేస్తున్న అడుగులు ఫలాలు ఇవ్వాలంటే బహుశా నాలుగైదేళ్లు పట్టొచ్చు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూల మార్పులు తెచ్చాం. మానవ వనరులపై పెట్టుబడి అనేది ప్రధాన అంశంగా భావిస్తున్నాం. ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకిత భావం చూపిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. గ్లోబల్ సిటిజన్ కావాలంటే మన భాషలో మార్పులు రావాలి. ప్రపంచస్థాయిలోనే పోటీపడాలి.. లేకుంటే మన భవిష్యత్ మారదు. నాడు–నేడు, అమ్మ ఒడి, గోరుముద్దతో మన ప్రయాణం ప్రారంభమైంది. టెన్త్ విద్యార్థులకు ఐబీ విద్యాబోధన అందించే దిశగా అడుగులు. ఐబీ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే విద్యా సంవత్సరం టీచర్లకు సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టిపెట్టాం. ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్రూమ్ను డిజిటలైజేషన్ చేస్తున్నాం. పిల్లలకు చదువులు సులభతరంగా అర్థమయ్యేలా ట్యాబ్లు ఇస్తున్నాం. బైజూస్ కంటెంట్తో అనుసంధానం చేశాం’’ అని సీఎం వైయస్ జగన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa