సీఎం రేవంత్ రెడ్డి చేసిన చేపల పులుసు వ్యాఖ్యలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే.. సీఎం జగన్, కేసీఆర్ కలిసి రోజా చేసిన చేపల పులుసు తిని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వాటా నుంచి నీళ్లు ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాగా.. ఈ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి అటు అసెంబ్లీతో పాటు పలు సందర్భాల్లో రిపీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు స్పందించని రోజా.. మొదటిసారిగా స్పందించారు.
ఓ ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రోజా. తాను ఎప్పుడు ఎవరి కోసం చేపల పులుసు చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. జాక్ పాట్లో సీఎం అయిన రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడాలో తెలియక.. ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారంటూ సెటైర్ వేశారు రోజా. కాగా.. గతంలోనూ రేవంత్ రెడ్డిపై రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కోవర్టుగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లారంటూ ఘాటు ఆరోపణలు చేశారు. గతంలోనూ రేవంత్ రెడ్డి చేపల పులుసు వ్యాఖ్యలు చేయగా.. తమ ఇంటికి సీఎం జగన్ ఎప్పుడు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాదని.. కోవర్టు రెడ్డని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో ఉంటూ టీడీపీ నేతలను కలవడంలోనే అతను కోవర్టని తెలుస్తోందన్నారు. 28 వంటకాలతో కేసీఆర్కు చంద్రబాబు డిన్నర్ ఇవ్వడం మరచిపోయారా అంటూ నిలదీశారు. కేసీఆర్, జగన్ తన ఇంట్లో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది చాలా బాధాకరమన్నారు రోజా. కాగా.. ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa