బాపట్ల జిల్లా మేధరమెట్లలో మార్చి 3న నిర్వహించ తలపెట్టిన సిద్ధం సభ 10వ తేదీన జరిపాలని పార్టీ నిర్ణయించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. మేధరమెట్ల వద్ద సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణలతో కలిసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్ధం సభలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. మేధరమెట్ల సిద్ధం సభకు వచ్చేందుకు ఇప్పటివరకు 7 లక్షల పైగా సంసిద్ధత తెలిపారని, మొత్తం 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 98 ఎకరాల ప్రాంగణంలో సభ నిర్వాహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, వాహనాల పార్కింగ్ కోసం కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆరు జిల్లాలు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు జిల్లాల నుండి పెద్ద ఎత్తన ప్రజలు సభకు హాజరవుతారని వివరించారు. ప్రభుత్వ పథకాలు, పాలనపై పార్టీ కేడర్, ప్రజలకు వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిశానిర్ధేశం చేస్తారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa