మార్చి 13, 14 తేదీలలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏప్రిల్ రెండో వారం లో ఎన్నికలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. సిద్ధం సభలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం పథకాలు గురించి సిద్ధం సభల్లో వివరిస్తున్నామన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చేయని విధంగా వైయస్ జగన్ ప్రభుత్వం పరిపాలన చేసిందన్నారు. ప్రజల స్పందన చూస్తే 175 కి 175 సీట్లు వస్తాయనే నమ్మకం తమకు ఉందన్నారు. మేధరమెట్ల సిద్ధం సభలో 3 గంటలకు వైయస్ జగన్ ప్రసంగం మొదలవుతుందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందని, అతి త్వరలో విడుదల చేస్తామన్నారు. సిద్ధం సభలోపే అన్ని సీట్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఎంతమంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. ప్రజలంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంటే ఉన్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa