టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపై జాతీయ జట్టులో తనకు చోటు దక్కదనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్కు గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే 35 ఏళ్ల రహానే అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్కు కూడా గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సీజన్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని పలు వార్తలు వినిపిస్తున్నాయి. 2013లో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అజింక్య రహానే ఇప్పటివరకు 85 టెస్టు మ్యాచ్లు ఆడాడు. 85 టెస్టుల్లో 12 సెంచరీలతో 5077 పరుగులు చేశాడు. అదేవిధంగా వన్డేల్లో 90 మ్యాచ్లు ఆడి 2962 పరుగులు చేశాడు. ఎట్టకేలకు ఈ ఏడాది జూలై 20న వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో రహానే భారత్ తరఫున ఆడాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa