ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి రోజాకు షాక్,,,,టికెట్ ఇవ్వవద్దంటున్న వైసీపీ అసమ్మతి నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 06:49 PM

ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలోనే షాకులు తగులుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను పక్కనబెడితే సొంత పార్టీ నేతల నుంచే ఆమెకు అసమ్మతి ఎదురవుతోంది. రోజాకు టికెట్ ఇవ్వవద్దంటూ ఇప్పటికే పలుసార్లు నగరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జుల నుంచి మంత్రి రోజాకు ఊహించని షాక్ తగిలింది. రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ వారంతా వైసీపీ అధిష్టానానికి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రోజాకు నగరి సీటు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని తేల్చిచెప్తున్నారు. సీటిచ్చినా ఓడిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు.


ఈ సందర్భంగా మంత్రి రోజాపై నగరి వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అని విమర్శించారు. రోజా, ఆమె అన్నదమ్ములు కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడపెట్టారని ఆరోపించారు. ఈ రాష్ట్రానికి సంబంధం లేని సెల్వమణి తమకు పదవులు ఇవ్వడం ఏమిటంటూ ప్రశ్నించారు. తమ భిక్షతోనే రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిందన్న ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు.. గతంలో అప్పుల్లో ఉన్న రోజాకు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నగరి నియోజకవర్గంలో భూకబ్జాలు, రౌడీయిజం, కమిషన్లు పెరిగిపోయాయని ఆరోపించారు. రోజాకు టికెట్ ఇవ్వద్దొంటూ సీఎంకు సూచించిన వైసీపీ నేతలు.. ఇస్తే వైసీపీకే నష్టమంటూ వ్యాఖ్యానించారు.


మరోవైపు నగరి నియోజకవర్గంలో రోజా సోదరుల జోక్యం ఎక్కువగా ఉందని వైసీపీ నేతల నుంచి గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసినవారిని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవలే ఓ వైసీపీ కౌన్సిలర్ కూడా రోజా సోదరుల మీద తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ కేజీ శాంతి, ఆమె భర్త, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ కేజే కుమార్‌లతో మొదటి నుంచి రోజాకు పడటం లేదు. ఈ నేపథ్యంలో నగరిలో వైసీపీ రెండువర్గాలుగా చీలిపోయింది. గతేడాది ఆగస్టులో నగరి పర్యటనకు వచ్సిన సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వీరిద్దరినీ కలిపే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రోజా వ్యతిరేక వర్గం బలంగా గొంతు వినిపిస్తోంది. ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ అధినేతకు సూచిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa