ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లి ఇదేం పాడుపని.. దాదాపు నెల తర్వాత ట్విస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 10:04 PM

అన్నమయ్య జిల్లాలో ఫుడ్ డెలివరీ బాయ్ చేతివాటం బయటపడింది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి ఇంట్లో ఎవరూ లేనిది చూసుకుని ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఎత్తుకెళ్లాడు. మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెకు చెందిన రెడ్ డిశేఖర్‌రెడ్డి ఇటుకలబట్టీ నిర్వహిస్తాడు. వీరు తరచూ ఇంటి తాళాలు కిటికిలో ఉంచి బట్టీ దగ్గరకు వెళతారు. ఈ ఈ క్రమంలో గత నెల 7వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు తీసుకుని ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న 157 గ్రాముల బంగారు నగలు, 200 గ్రాముల వెండి, రూ.52 వేలు నగదు అపహరించుకుని వెళ్లారు.


గత నెల 24వ తేదీన చోరీ జరిగినట్లు గుర్తించిన బాధితుడు తల్లి నారాయణమ్మకు చెందిన బంగారు నగలు చోరీకి గురైనట్లు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం విచారణలో నిందితుడు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన షేక్‌ అజారుద్దీన్‌ గా గుర్తించారు. అతడు మదనపల్లెలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.


గత నెల 7వ తేదీన అజారుద్దీన్ రెడ్ డిశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కిటికీలో ఉంచిన తాళాలు తీసుకుని బంగారు, వెండి, డబ్బుతో పారిపయోాడు. అతడిని సోమవారం తట్టివారిపల్లె దగ్గర బైక్‌పై వస్తుండగా పోలీసులు ప్రత్యేక బృందం పట్టుకుందన్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.10 లక్షలు ఉంటుందన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa