టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం కల్లూరు అర్బన్ 19వ వార్డు లక్ష్మీటౌన్ షిఫ్లో ఆమె శంఖారావం, బాబు ష్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్ర మంలో పాల్గొని ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం టీడీపీ మేనిఫెస్టో పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ టీడీపీ కూటమి రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో జగన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విభజన హామీల అమలు, ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెం డర్, ప్రజలపై పన్నులు, చార్జీల భారం వేయనని, మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఘోరంగా విఫలం అయ్యారన్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రతి కుటుంబానికి చేర్చాలన్నారు. కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాద వ్, పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, వంగాల జనార్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa