ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ కార్మికులపై నమోదుచేసిన పోలీసు కేసులను ఎత్తివేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ పలు డిమాండ్ల పరిష్కారంపై మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. దీంతో మున్సిపల్ ఉద్యోగులపై అధికారులు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి డీజీపీకి లేఖ రాశారు. సమ్మె సమయంలో ఏలూరు, విశాఖ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలలో మున్సిపల్ కార్మికులపై కేసులు నమోదయ్యాయి. వీటిని ఎత్తివేస్తున్నట్లు ఏపీ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు సమాన పనికి సమాన వేతనం సహా పలు డిమాండ్ల సాధన కోసం గతేడాది డిసెంబర్ 26న ఏపీలోని మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. 16 రోజుల పాటు సమ్మె చేపట్టారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో వీధుల్లో పారిశుద్ధ్య పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు తాత్కాళిక సిబ్బంది సాయంతో పనులు చేపట్టిన పరిస్థితి అప్పట్లో కలిసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులపై అధికారులు పలుచోట్ల ఫిర్యాదులు చేశారు. దీనిపై కేసులు నమోదయ్యాయి. అయితే ప్రభుత్వంతో కార్మికులు జరిపిన చర్చలు విజయవంతం కావటంతో 16 రోజుల తర్వాత మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. చర్చల సందర్భంగా 21 వేల జీతం సహా కేసుల ఎత్తివేతపై ప్రభుత్వం కార్మికులకు హామీ ఇచ్చింది.
ఇక చెప్పిన విధంగానే ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. చర్చల సమయంలో చెప్పినట్లుగానే మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మున్సిపల్ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa