ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిలకలూరిపేట ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యానికి పోలీసులే బాధ్యత వహించాలని.. కొందరు అధికారుల తీరు చూస్తుంటే ఇది కుట్రగా కినిపిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. మోదీ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రతలకు సంబంధించిన అంశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దేశ ప్రధానమంత్రి హాజరయ్యే సభకు బ్లాంక్ పాస్లు ఇచ్చారని, ఎవరికి జారీ చేస్తున్నారో కనీసం వాళ్ల పేర్లు లేకుండా పాస్లు ఇవ్వడంపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa