ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2024, 01:46 PM

ఎన్నికల షెడ్యూల్‌ వల్ల  వెసులుబాటు వచ్చిందని, ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు.  ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలని, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ రీజనల్‌ కో ఆర్డీనేటర్ల సమావేశం నిర్వ‌హించారు.  తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సాగిన ఈ  సమావేశంలో వైయ‌స్‌ జగన్‌ బస్సుయాత్ర, రూట్‌ మ్యాప్‌, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. మూడు పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యచరణపై పార్టీ నేతలకు సీఎం వైయ‌స్ జగన్‌ దిశానిర్దేశం చేశారు. రీజనల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో సీఎం వైయ‌స్ జగన్‌ మాట్లాడుతూ.. అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వల్ల ఈ వెసులుబాటు వచ్చిందని తెలిపారు. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలని, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్ర కూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించిన వైయ‌స్ఆర్‌సీపీ ప్రచారంపై దృష్టి పెట్టింది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్‌ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. దాదాపు నెలపాటు జనంలోనే ఉండనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్‌.. మధ్యాహ్నం/సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి విడతలో బస్సు యాత్ర.. ఆ తర్వాత ఎన్నిలక ప్రచార సభలు ఉండనున్నాయి. ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa