మైలవరంలో టీడీపీ అభ్యర్థిత్వం కోసం కోటీశ్వరులు మాజీ మంత్రి దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ల మధ్య వేలం పాట నిర్వహిస్తున్న చంద్రబాబు.. ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైతే.. ఆ స్థానం నుంచి జనబలమే గీటురాయిగా బీసీ వర్గానికి చెందిన రైతు బిడ్డ సర్నాల తిరుపతిరావును వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా సీఎం వైయస్ జగన్ ఎంపిక చేశారు అని వైద్ఫ్ నేతలు తెలుపుతున్నారు. మైలవరంలో తిరుపతి రావు ప్రజా సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవను గమనించిన సీఎం వైయస్ జగన్.. మొన్నటి ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. జెడ్పీటీసీ సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన తిరుపతిరావు.. జనంతో మేమకవుతూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇదే ఆయనను మైలవరం నియోజకవర్గం వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేయానికి దారితీసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa