సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను ‘సిద్ధం’ సభలతో సన్నద్ధం చేసిన వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్ మేనిఫెస్టో రూపకల్పనపై చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 4 లోక్సభ స్థానాల పరిధిలో ఇప్పటికే సిద్ధం సభలు నిర్వహించిన నేపథ్యంలో మిగతా 21 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రజలతో మమేకమవుతూ పార్టీ శ్రేణులను, అభిమానులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు ఈనెల 27న ఇడుపులపాయ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్ మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం చెప్పారు. చెప్పిన వాటితోపాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేయడంతో జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగింది. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలతో ఇది ప్రస్ఫుటితమైంది. బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా మేనిఫెస్టోను ప్రకటించనుండటంతో జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అన్న నమ్మకం ప్రజల హృదయాల్లో నాటుకుపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa