కోట్ల, కేఈ కుటుంబాలతోనే డోన్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మాజీ కేంద్ర మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి అన్నారు. బుధవారం ప్యాపిలి మండలంలోని మాధ వరం, గార్లదిన్నె, రాచెర్ల, రామక్రిష్ణాపురం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తన తండ్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి ముఖ్య మంత్రిగా, కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా నియోజకవర్గంలో ఎన్నో శాశ్వతమైన అభివృద్ధి పనులు చేశారన్నారు. అయితే ఆర్థిక మంత్రి బుగ్గన డోన్ను తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకు నియోజక వర్గంలో మంత్రి చేపట్టిన పనులు పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవాలు చేశారని కోట్ల విమర్శించారు. డోన్లో అధికారపార్టీ అరాచకాలు, దౌర్జాన్యా లకు విసుగు చెందిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుగ్గనను ఇంటికి పంపడం ఖాయమన్నారు. టీడీపీ అధికారం లోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలతో పేదరికాన్ని నిర్మూలిస్తామన్నారు. అనంతరం ఆయన ఇంటింటా తిరిగి టీడీపి మేనిఫెస్టో పత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, నాయకులు మాధవరం స్వామి, ఆర్ఈ నాగరాజు, వై లక్ష్మీనారాయణయాదవ్, బీఈ రమణగౌడు, నబీరసూల్, బీఈ క్రిష్ణమూర్తి, సర్పంచు లక్ష్మీనారాయణ, రామ్కుమార్, బీజేపీ నాయకలు వడ్డె మహారాజ్, కేసీ మద్దిలేటి రాచెర్ల శ్రీరాములు, సురేంద్ర, రజిని యాదవ్, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa