దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా యువత పోరాడాలని పీవైఎల్ నాయకులు కె.పోతురెడ్డి, టి.బాబురావు, పీడీఎస్యూ నాయకుడు బి.వినోద్ పిలుపునిచ్చారు. పీవైఎల్, పీడీఎస్యూ ఆధ్వర్యంలో దొర మామిడి, బుట్టాయగూడెంలో శనివారం భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. భగత్సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ సమాజంలో అసమానతలులేని వ్యవస్థ ఉండాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాల ర్పించిన భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని విమర్శించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ ప్రజలపై తీవ్రమైన దాడులు చేస్తున్నారన్నారు. పూనెం రాముడు, మామిడి మురళి, కరకాల ప్రతాప్, జి.బాబురావు, గోగుల చిన్నారెడ్డి, పండు, వి.సాయి, ఎం.మం గరాజు, కె.రామ్, జి.శ్యామ్, ఎం.విష్ణు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa