నేడు ఐపీఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా సన్రైజర్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి ఓటమిపాలైంది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లు రోహిత్ శర్మ 26 పరుగులు, ఇషాన్ కిషన్ 34, నమన్ ధీర్క్ 30, తిలక్ వర్మక్ 64 పరుగులు, హార్దిక్ పాండ్యా 24, టిమ్ డేవిడ్ 42, రొమారియో షెపర్డ్ 15 పరుగులు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa