విశాఖనగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 31న జరిగే ఐపీఎల్ మ్యాచ్లో పాల్గొనే చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల ఆటగాళ్లు శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. శుక్రవారం నగరానికి చేరుకున్న చెన్నై సూపర్కింగ్స్ ఆటగాళ్లలో ఎంఎస్ ధోనీతోపాటు రుతురాజ్ గైక్వాడ్, రహానే, షేక్ రషీద్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, మిశ్చల్, శివం దుబే, అవినాష్ రావు, రాజవర్ధన్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, నిశాంత్ సిందు, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, దుషార్ దేశ్పాండే, తదితరులు ఉన్నారు. విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్కు వెళ్లేందుకు సీఎస్కే ఆటగాళ్లు బస్సు ఎక్కుతున్న సమయంలో అభిమానులు కేరింతలు కొట్టారు. ధోనీ...ధోనీ అని నినాదాలు చేశారు. కాగా, ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో విజయం సాధించి మూడో మ్యాచ్లో పాల్గొనేందుకు విశాఖ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహీంద్రసింగ్ ధోనీ అభిమానులు మ్యాచ్పై ఆసక్తిగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa