‘వలంటీర్ల వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు. సీఎం జగన్ ఇచ్చిన రూ.5,000 కన్నా మేం మెరుగైన జీతాలు ఇస్తాం. అవసరమైతే స్కిల్ డెవల్పమెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి లో ఆయన మాట్లాడారు. ‘వలంటీర్లు ప్రజలకు సేవకులుగా పనిచేయాలే తప్ప వైసీపీకి కాదు. వలంటీర్లకు ఇచ్చే రూ.5,000 నెలవారీ జీతం జగన్ జేబు లోది కాదు. అది ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఇస్తున్నది. వైసీపీకి పనిచేస్తే వలంటీర్లు తమ జీవితాలను పోగొట్టుకుంటారు. కొంతమంది వలంటీర్లు తాము రాజీనామా చేస్తున్నామని, వైసీపీలో యాక్టివ్గా పనిచేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి వారిపైన అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుంది. మేం వస్తే వలంటీర్ల వ్యవస్థను చక్కదిద్ది మెరుగుపరుస్తాం’ అని అచ్చెన్న హామీ ఇచ్చారు. సీఎం జగన్ దగాకోరని, సొంత బాబాయిని చంపించి చంద్రబాబు చంపాడని గత ఎన్నికల్లో లబ్ధి పొందారని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa