కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఏప్రిల్ 8న పవన్ కళ్యాణ్ రానునారు. ఆరోజు సాయంత్రం బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం ఏప్రిల్ 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పల్గొననున్నారు. ఆ తర్వాత 10న కోనసీమ జిల్లా రాజోలు, 11న పి.గన్నవరం, 12న తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దీనికి వారాహి విజయభేరి బహిరంగ సభగా నామకరణం చేశారు. మరోపక్క పవన్ పిఠాపురంలో పోటీచేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధి కార వైసీపీ భారీగా మోహరించింది. కోట్లలో నగదు పంపి ణీ, వివిధ వర్గాలను, వారి ఓట్లను కొనుగోలు చేయడానికి పెద్దఎత్తున అడ్డదారి వ్యూహాలు అమలుచేస్తోంది. నియోజకవర్గంలో మండలాలను మూడు ముక్కలు చేసి ముగ్గురు కీలక నేతలకు అప్పగించి వారి ద్వారా చెరో రూ.50కోట్ల చొ ప్పున ఖర్చుచేయిస్తోంది. డబ్బుల పంపకం, దొంగ ఓట్లు వే యడానికి వీలుగా ఏకంగా కడప నుంచి బృందాలను తరలిస్తోంది. వీరికోసం నియోజకవర్గంలో అద్దె ఇళ్లు కూడా తీసింది. ఈ కుయుక్తులను పసిగట్టిన జనసేనాధిపతి వైసీపీ అ డ్డగోలు వ్యూహాలపై ధ్వజమెత్తారు. తనను ఓడించడానికి వైసీపీ పిఠాపురంలో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉందని నిప్పులు కక్కారు. ఈ నేపథ్యం లో పవన్ ఎన్నికల ప్రచారం, వైసీపీ ఎన్నికల వ్యూహాలతో పిఠాపురం రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa