బందరు పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిని ఖరారు చేశారు. వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరో మూడు అసెంబ్లీ స్థానాలను పెండింగ్లో ఉంచిన జనసేన, విశాఖపట్నం సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ పేరును దాదాపు ఖరారు చేసింది.
అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లలో కసరత్తు జరుగుతోంది. అవనిగడ్డలో చాలా మంది ఆశావహులు ఉన్నారని.. త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేస్తామని జనసేన చెబుతోంది. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పెండింగ్లో ఉన్న అభ్యర్థులను త్వరలో ప్రకటించనున్న పవన్.. బందరు ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa