రాష్ట్రంలో రైతులను ఆదుకోని జగన ప్రభుత్వాన్ని ఓడించాలని అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జగన ప్రభుత్వంలో రైతులు సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా... ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కరువు మండలాలుగా ప్రకటించినా రైతులకు ఎలాంటి సాయం అందించలేదన్నారు. రెండు రోజుల కిందట తాడిపత్రి, పెద్దవడుగూరు, కూడేరు తదితర మండలాలకు చెందిన రైతులు కరువు వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు సాయం అందించాలని కోరిన వారిపై కూడా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వివేకా హత్యపై పీసీపీ అధ్యక్షురాలు షర్మిల, డాక్టర్ సునీత జగనను ప్రశ్నిస్తున్నారని, వాటినూ జగన ఏ మాత్రం స్పందించడం లేదని, మొదట వారి ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత ఆయన ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నారాయణస్వామి, లింగమయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa