ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు శాడిస్ట్, హంతకుడు.. మేమంతా సిద్ధం సభలో జగన్ ఆవేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 07:26 PM

ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల దాడి పెరుగుతోంది. ఆరోపణలు, మాటల్లో తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కొనకనమిట్ల వేదికగా జరిగిన మేమంతా సిద్ధం బహిరంగసభలో చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును హంతకుడు, శాడిస్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి అవ్వాతాతలకు, వితంతువులకు వాలంటీర్ల ద్వారా పింఛన్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు దారి అడ్డదారి అని విమర్శి్ంచారు.


" చంద్రబాబుది ఎప్పుడూ అడ్డదారే. ఆయనకు రాజకీయ విలువలు ఎప్పుడు కూడా పాతాళంలోనే ఉంటాయి. విలువలు, విశ్వసనీయతకు అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు.వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్దాలు, కుట్రలే చంద్రబాబు మార్క్‌ రాజకీయం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తే జగన్‌ తెచ్చిన పథకాలకు ముగింపు పడుతుంది. 56 నెలలుగా అవ్వాతాతలకు ఇంటి వద్దే అందుతున్న పింఛన్లు అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. మండే ఎండలో పేదలను నడిరోడ్డుపై నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు. అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు." అని జగన్ విమర్శించారు.


మరోవైపు జెలొసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గని కడుపుమంట చంద్రబాబుదని జగన్ సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంచి జరుగుతోందని చెప్పిన గీతాంజలిని సోషల్ మీడియాలో వేధించి చంపారని ఆరోపించారు. చంద్రబాబు గత చరిత్ర ఏంటో జనాలకు తెలుసన్న జగన్.. ఇచ్చిన హామీల అమల్లో ఆయన రికార్డు అందరికీ తెలిసిందేనన్నారు. " వాలంటీర్‌ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. అందుకే వాలంటీర్లు లేకుండా చేయాలనేది చంద్రబాబు కుట్ర. తన స్వార్థ రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్ట్‌ కాక మరేమిటీ? పేద పిల్లల కోసం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే ఓర్వలేని వ్యక్తి, ఎస్సీ ఎస్టీలను కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తిని శాడిస్ట్ అనక మరేమంటారు" అని జగన్ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa