ఐపీఎల్లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు చేసింది. ఆ తరువాత 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పృథ్వీ షా 66 పరుగులు, డేవిడ్ వార్నర్ 10,అభిషేక్ పోరెల్ 41, ట్రిస్టన్ స్టబ్స్ 71, రిషబ్ పంత్ 1, అక్షర్ పటేల్ 8, లలిత్ యాదవ్ 3, ఝే రిచర్డ్సన్ 2 పరుగులు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa