2019 ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే దశలవారీ మద్యపాన నిషేధం చేస్తామని వైసీపీ తరపున హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తైంది. హామీ అమలు చేశారా జగనన్న అంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు. మద్యపాన నిషేధం పక్కనపెడితే నాసిరకం మద్యం అమ్ముతూ జగన్ సారా వ్యాపారం చేస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. మద్యం ధరలు పెంచి సొంత బ్రాండ్లతో పేద ప్రజల డబ్బులు దోచుకుంటున్నారంటూ షర్మిల ఆరోపించారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని, ఎంతమందికి ఉద్యోగాలను ఈ ప్రభుత్వం కల్పించిందంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాల ప్రశ్నలతో వైసీపీ నాయకులకు షర్మిల కంటిపై కునుకులేకుండా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa