ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమయ్యిందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్, వైఎస్ వివేకా ఆత్మలు క్షోబిస్తున్నాయని, సొంత బాబాయిని నరికి చంపితే జగన్ హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్, వివేకానంద రెడ్డిలు ఈ జిల్లా బిడ్డలని, మేము కూడా మీ ఇంటి బిడ్డలమని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ కి ఈ గడ్డ అంటే ఎంతో ప్రేమని, జీవించినంతకాలం ఇక్కడి ప్రజల కోసమే జీవించారన్నారు. తాను ఉన్నంతకాలం ఇక్కడి ప్రజలకు సేవ చేశారన్నారు. వివేకానంద రెడ్డి సైతం ఇక్కడి ప్రజలకు సేవ చేవారన్నారు. - వైఎస్ఆర్,వివేకా వంటి నాయకులు మళ్లీ దొరకడం కష్టమన్నారు. తన బాబాయి వివేకానంద రెడ్డి గొడ్డలి పోట్లకు బలయ్యారన్నారు. వివేకానంద రెడ్డి చనిపోయి ఐదేళ్లయినా ఇంత వరకు హంతకులకు శిక్ష పడలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా ఆత్మ ఇవాల్టికీ ఘోషిస్తుందన్నారు. హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని చెప్పడానికి ఆధారాలున్నా..ఇప్పటివరకు శిక్ష పడకపోవడం దారుణమన్నారు. స్వయంగా సీఎం జగన్ హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa