దేశాన్ని పట్టిపీడిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఇండియా కూటమి కృషి చేస్తుందని ఇందుకు కార్యకర్తలు కూడా కలిసి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనేకుల మురళి, కాంగ్రెసు పార్టీ పెనమలూరు అభ్యర్థి ఎలిసెల సుబ్రహ్మణ్యం పిలుపు నిచ్చారు. బుధవారం పెనమలూరులో కిలారు వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఇండియా కూటమి పార్టీల ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ధనేకుల మురళి మాట్లాడు తూ, రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఓటర్లు ఓడించి ఆ ప్రభుత్వాలకు చరమగీతం పాడాలని కోరారు. కమ్యూనిస్టు నాయకులు పంచ కర్ల రంగారావు మున్నంగి నరసింహరావు, మస్తాన్వలిలు మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన మోదీ ప్రభుత్వం ఆస్తులను, దేశ సంపద లను ధరాదత్తం చేసిందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభ్యర్ధి ఎలిసెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మూడు మండలాల అధ్యక్షులు సురేష్, రాజశేఖర్, బాలాజీ నాయక్, త్రిమూర్తులు, కొసనం రాము, కైలే సునీల్, రాజేష్, కీర్తి, భవాని, పుసులూరి పాతాళ లక్ష్మి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa