ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీకు జగన్‌ గారిని విమర్శించే స్థాయి ఎక్కడది చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 09:16 AM

వైయ‌స్‌ జగన్ కాలి గోటికి కూడా చంద్రబాబు వ్యక్తిత్వం సరిపోదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.....  నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఎన్ని సంస్కరణలు తెచ్చానో చెప్తా.. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం తెచ్చావో చెప్పు. నీ హయాంలో రైతు భరోసా కేంద్రాలున్నాయా? వాటి ద్వారా ఎరువులిచ్చావా? ఉచిత పంటల బీమా ఉందా?  నీ హయాంలో ధాన్యం పుట్టి ధర రూ.12వేల నుంచి రూ.13 వేలు ఉండేది.  నీ పక్కన ఉన్న సోమిరెడ్డే రైస్‌మిల్లర్లు, దళారుల వద్ద రూ.50 కొట్టేశాడు. ఇప్పుడు రూ.18,500 గిట్టుబాటు ధర ఉంటే...మిల్లర్లు రూ.22వేలు పెట్టి రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు.  రైతు రథాల పేరుతో ట్రాక్టర్ల ధర పెంచి..దానిలో కూడా నువ్వూ, నీ కొడుకు, సోమిరెడ్డి దోచుకున్నారు. నిద్రలేస్తే అవినీతి, అబద్ధాల మయమైన నీకు జగన్‌ గారిని విమర్శించే స్థాయి ఎక్కడుంది? నీకు ఎప్పుడూ గమ్యం ఉంటుంది కానీ..మార్గం ముఖ్యం కాదు అనుకునే వాడిని.  జీవితంలో, రాజకీయాల్లో వ్యక్తికి మార్గం ముఖ్యం. నీకసలు మార్గమే అవసరం లేదు. దేనిమీదైనా సరే..నడిచి వెళ్లి గమ్యాన్ని చేరుకుంటే చాలనుకునే నీచమైన మనస్థత్వం నీది. జగన్‌ గారు ఆ గమ్యాన్ని చేరుకోడానికి మార్గాన్ని అన్వేషించేవారు.  జగన్‌ గారితో నువ్వు ఈ జన్మలో సాటిరావు. నువ్వు ఎన్నిరకాలుగా ఆరోపణలు చేసినా ఫలితం లేదు అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa