ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడే చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా నగదు సీజ్ చేస్తున్నారు. తాజాగా ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న అంతరాష్ట్ర చెక్పోస్ట్ గరికపాడు దగ్గర భారీగా డబ్బులు దొరికాయి. తెలంగాణవైపు నుంచి ఏపీవైపు వస్తున్న లారీని పోలీసులు ఆపారు.. అందులో తనిఖీ చేయగా కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. మొత్తం రూ.8 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు, ఎన్నికల అధికారులు ఈ డబ్బుల్ని లెక్కించేందుకు ఏకంగా కౌంటింగ్ మెషిన్లు తెప్పించారు. పక్కా సమాచారంతోనే తనిఖీలు చేసి డబ్బుల్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు ఎవరివి.. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళుతున్నారనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇంత భారీ మొత్తంలో డబ్బులు దొరకడం కలకలంరేపుతోంది. లారీ ఉన్న డ్రైవర్ నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. ఈ డబ్బులకు సంబంధించిన పూర్తి వివరలు తెలియాల్సి ఉంది.
ఏపీలో ఎన్నికల్లో ప్రచారం ముగిసేందుకు సమయం దగ్గరపడుతోంది.. 13న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఓటర్లకు పంచేందుకు డబ్బుల్ని తరలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారీగా డబ్బులు పట్టుబడతున్నాయి.. పోలీసులు, ఎన్నికల అధికారులు కూడా నిఘాను పెంచి చెక్పోస్టుల దగ్గర తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. అంతేకాదు ఓటర్లకు పంచేందుకు తీసుకొచ్చిన తాయిలాలు కూడా భారీగా దొరికిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa