ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు తిరుమలలో పర్యటించనున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 10:26 AM

చంద్రబాబుకు చిత్తూరు సెంటిమెంట్‌ ఉంది. శనివారం ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో ఆయన వరుసగా మూడు సభల్లో... నంద్యాల, హిందూపురం, చిత్తూరులో పాల్గొంటారు. 2014 ఎన్నికల్లో ఆయన చిత్తూరులోనే చివరి ప్రచార సభను నిర్వహించారు. అప్పుడు ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. అదే సెంటిమెంటును ఇప్పుడూ కొనసాగిస్తూ చిత్తూరు సభతో తన ప్రచారానికి ముగింపు పలకనున్నారు. కాగా, చంద్రబాబు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. చిత్తూరులో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సభతో ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికి సాయంత్రం 6.30 గంటలకు తిరుమలలోని గాయత్రి అతిథి గృహానికి చేరుకుంటారు. అర్ధగంట తర్వాత కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa