ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన.. పోలీసులకు కొత్త తలనొప్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 05:07 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారనే కారణంతో నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై ఛార్జెస్ ఫైల్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. అలాగే శాఖాపరమైన విచారణ జరిపించాలని డీజీపీని.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎస్పీతో పాటుగా ఎస్డీపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అంతమంది జనసమీకరణ చేయడంపై ఈసీ సీరియస్ అయ్యింది.


మరోవైపు శనివారం నంద్యాలలో పర్యటించారు అల్లు అర్జున్. సతీమణి స్నేహారెడ్డితో కలిసి నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. శిల్పా రవి బన్నీకి ఫ్రెండ్ కావటంతో.. ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్ అతని ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో వేలాదిమంది జనం అక్కడకు చేరుకున్నారు. దీంతో శిల్పా రవి ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దీనిపై అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదైంది. అనుమతి లేకుండా జనసమీకరణ చేశారనే కారణంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.


ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ముందస్తు అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారని.. సెక్షన్ 144ను ఉల్లంఘించారంటూ బన్నీ, శిల్పారవి మీద నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా పోలీసులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో.. ముందస్తు అనుమతి లేకుండా అంతపెద్ద సంఖ్యలో జనం తరలిరావటంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారంటూ నంద్యాల ఎస్పీపై చర్యలకు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa