ఏపీ ఎన్నికల్లో ఓటువేసేందుకు ఈసారి ప్రవాసాంధ్రులు భారీగా తరలివచ్చారు. అమెరికా సహా వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజలు.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఐదేళ్లకు ఓసారి వచ్చే ఓట్ల పండుగలో ఓటుహక్కు వినియోగించుకుని ప్రజాస్వా్మ్య స్ఫూర్తిని చాటేందుకు తరలివచ్చారు. అయితే.. పోలింగ్ బూత్ పక్క వీధిలో ఉన్నప్పటికీ ఓటు వేసేందుకు కొంతమంది బద్ధకిస్తున్న ఇవాళ్టి రోజుల్లో.. ఓ ఎన్ఆర్ఐ ఏకంగా అమెరికా నుంచి లక్షలు ఖర్చుపెట్టుకుని సొంతూరుకు చేరుకున్నారు. తన ఊర్లో ఓటు వేసి..
పౌరుడిగా తన బాధ్యతను నిర్వర్తించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బి. ప్రసన్నకుమార్ అనే యువకుడు అమెరికాలో ఉంటున్నాడు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తు్న్నారు. అయితే ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తన ఓటు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న ప్రసన్న కుమార్ లక్షా 60 వేల రూపాయలు ఖర్చు చేసి మరీ.. పిఠాపురానికి తిరిగొచ్చాడు. సొంతంగా ఖర్చుపెట్టుకుని సొంతూరుకు చేరుకున్న ప్రసన్నకుమార్.. ఓట్ల పండుగలో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకున్నాడు.
ఇక ఓటువేసేందుకు అంతదూరం నుంచి లక్షలు ఖర్చుచేసుకుని వచ్చిన ఈ యువకుణ్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజనం ప్రసన్నకుమార్ తీరును ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రసన్న కుమార్ తరహాలో ఓటు హక్కు వినియోగించుకుని తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరుతున్నారు. ఖర్చును, సుదూర ప్రయాణాన్ని సైతం పక్కనబెట్టి ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనేందుకు వచ్చాడంటూ అభినందిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేస్తుండటంతో పిఠాపురం నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ను మరోసారి ఓడించేందుకు వైసీపీ కూడా సర్వశక్తులూ ఒడ్డుతున్న నేపథ్యంలో.. పోటీ మరింత రసవత్తరంగా మారింది. దీంతో పిఠాపురం వాసులు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa