సోషల్ మీడియా పరిధి పెరిగాక.. ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో సోషల్ మీడియా యూజర్లు మరింత యాక్టివ్గా ఉంటున్నారు. రాజకీయ నాయకులు వేసే ప్రతి అడుగును నిశితంగా గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో పొలిటికల్ లీడర్లు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పనిని సోషల్ మీడియా ఓ కంట గమనిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని బరిలో ఉన్నారు. అయితే ఆయన ఓటు మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. దీంతో ఉదయమే తన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. మంగళగిరిలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటు వేసిన తర్వాత ప్రింట్ అవుట్ రాదా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈవీఎం మెషీన్లో ఓటు వేసిన తర్వాత పక్కనే ఉన్న అధికారులను పవన్ కళ్యాణ్.. ప్రింట్ అవుట్ రాదా అని అడిగారని నెట్టింట వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు అధికార వైసీపీ సైతం ఈ వీడియోను షేర్ చేసింది. 2 లక్షల పుస్తకాలు చదివానంటున్న పవన్ కళ్యాణ్కు కనీసం ఇది కూడా తెలియదా అంటూ వైసీపీ తన పోస్టులో రాసుకొచ్చింది. బేసిక్ పరిజ్ఞానం లేని నువ్వు రాజకీయ పార్టీ అధ్యక్షుడివి అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. మరోవైపు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa