ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బౌన్సర్లతో వచ్చిన టీడీపీ అభ్యర్థి.. వైసీపీ అభ్యంతరం, హై టెన్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 07:45 PM

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజవర్గం టీడీపీ అభ్యర్థి థామస్ తీరు వివాదాస్పదం అయ్యింది. కార్వేటి నగర్ మండలం అన్నూరు పోలింగ్ కేంద్రం దగ్గరకు థామస్ తమిళనాడు నుంచి భారీ బౌన్సర్లను తీసుకొచ్చారని.. వాళ్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం స్థానికేతరుల్ని ఎలా అనుమతిస్తారని వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బౌన్సర్లను తీసుకురావడంపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రశ్నించారు.. వారితో వాగ్వాదానికి దిగారు.


థామస్ నారాయణస్వామిని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ నేతలు. వాహనంలో వచ్చిన బౌన్సర్లను డిప్యూటీ సీఎంతో పాటు అనుచరులు అడ్డుకున్నారు.. ఆ బౌన్సర్లను పోలీసులకు అప్పగించారు. వారంత ఆధార్ కార్డులు చూపించాలని డిమాండ్ చేశారు. గంగాధర నెల్లూరులో ముందస్తు ప్లాన్ ప్రకారం గొడవలు సృష్టించడానికి టీడీపీ అభ్యర్థి థామస్ ప్రయత్నిస్తున్నాడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు.


అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తోన్న బౌన్సర్లను వెంటనే అరెస్ట్ చేయాల్సిందేనంటూ వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాక ఇంకా ఫిర్యాదు ఏంటని వైసీపీ నేతలు నిలదీశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కుట్రతో టీడీపీ అభ్యర్థి థామస్ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa