ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయన ఆగడాలు ఎక్కువైపోతున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 16, 2024, 08:56 PM

తాడిపత్రిలో టీడీపీ సానుభూతిపరులపై డీఎస్పీ చైతన్య  చేసిన దాడిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అతను రాజంపేట నుంచి తాడిపత్రి ఎలా వచ్చారని బాబు ప్రశ్నించాు. డీఎస్పీ ఆగడాలు, దౌర్జన్యకాండపై ఎన్నికల కమిషన్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే చీఫ్ సెక్రటరీ వ్యవహార శైలిపై చంద్రబాబు, పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రెండు రోజులు ముందు డీబీటీకి నిధుల విడుదలపై హడావుడి చేయడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. వృద్ధుల పెన్షన్లు విషయంలో సీఎస్‌ వ్యవహారశైలిని కూడా టీడీపీ నేతలు ప్రస్తావించారు. అన్ని గుర్తు ఉంటాయంటూ ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa