సార్వత్రిక ఎన్నికలలో గతంలో ఎన్నడూలేని విధంగా మార్కాపురం పట్టణంలో ఓటింగ్ శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే తక్కువే అయినా ఇంతకుముందెన్నడూ ఎప్పుడు ఈ మాత్రం పోలింగ్ శాతం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నమోదుకాలేదు. మార్కాపురం పట్టణంలోని మొత్తం 58 పోలింగ్ కేంద్రాల్లో 56,021 ఓట్లు ఉండగా ఈ ఎన్నికల్లో 45,250 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 80.77 శాతం ఓట్లు పోలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పట్టణంలో 74 శాతం మాత్రమే పట్టణంలో పోలింగ్ శాతం నమోదైంది. ముఖ్యంగా ప్రధాన పట్టణంతో పోల్చితే శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓటు హక్కు వినియో గించుకున్నారు. 58 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 30 వరకు శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. విజయాటాకీస్ ఏరియా, ఎస్టేట్, పూలసుబ్బయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో ఒక్కో కేంద్రంలో రమా రమి 87 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి. ప్రధాన పట్టణంలో 70 నుంచి 75 శాతం వరకే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా 12వ బ్లాకు పరిధిలోని స్థానిక చెన్నరాయుని పల్లిలో 94.60 శాతం పోలైంది. మొత్తం 741 ఓట్లకుగాను 701 మంది ఓటు హక్కు విని యోగించుకున్నారు. అత్యల్పంగా స్థానిక 10వ బ్లాకు పరిధిలోని 40వ పోలింగ్ కేంద్రంలో 69.89 శాతం నమోదైంది. మొత్తం 870 ఓట్లకుగాను 608 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ బూత్ పరిధిలోనే మంత్రి ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిల ఓట్లు ఉండడం గమనార్హం. విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపార రంగాలకు చెందిన వాళ్లే ఈ బూత్ పరిధిలో అధికంగా ఉండడం విశేషం. పట్టణంలోని అన్ని బూత్లలో కలిపి పురుషులకంటే మహిళల ఓట్లే ఎక్కువ. పురుషుల ఓట్లు 27,428 ఉంటే మహిళలవి 28,591 ఉన్నాయి. సు మారు 1,163 మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి. పోలింగ్లో కూడా మహిళలు పురుషులకు ఏ మాత్రం తీసిపోలేదు. పురుషులు 81.12 శాతంతో 22,251 ఓట్లు వేశారు. అదే విధంగా మహిళలవి 81.14 శాతంతో 23,201 ఓట్లు పోలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa