ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్నాడు జిల్లాని రణరంగం చేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 02:15 PM

ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఇరు పార్టీల నేతల రణరంగం అంతా ఇంతా కాదు.  దాడులు, నిర్బంధం ఇలా అనేక రకాలుగా దుశ్చర్యలకు పాల్పడ్డారు. తాజాగా పల్నాడు ఘటనలపై టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై మానవ మృగాల్లా దాడులకు పాల్పడుతున్న పిన్నెల్లి సోదరులను పోలీసులు ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు కోవర్టులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు త్వరలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వందల మంది పౌరులపై దాడులు జరిగితే పోలీసు సంఘం స్పందించకుండా ఎక్కడ నిద్రపోతోందంటూ మండిపడ్డారు. వినుకొండలో ఎస్సైను వైసీపీ రౌడీలు నిర్బంధించి కొట్టినా పోలీసు అధికారులకు పట్టదా అంటూ కనపర్తి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa