ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యోదేవోభవ అనిపించిన వైద్యురాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 02:13 PM

ఓ వైద్యురాలి అప్రమత్తత ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపింది. రహదారి మీదనే సీపీఆర్ చేయడంతో బాలుడి ప్రాణం నిలిచింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ‌వైరల్ అవుతోంది. వైద్యురాలు రవళికి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. విజయవాడలోని అయ్యప్ప నగర్‌లో ఆరేళ్ల బాలుడు సాయి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రోడ్డుపై వెళుతున్న తల్లిదండ్రులను గమనించి వెంటనే రవళి స్పందించింది. రోడ్డు పైనే పడుకోబెట్టి సీపీఆర్ చేసి ప్రాణాలు పోసింది. తరువాత ఆసుపత్రికి తరలించి పూర్తి చికిత్స చేయడంతో బాలుడు కోలుకున్నాడు. రవళి చేసిన పనికి అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa