ఇసుక, ఇతర ఖనిజాల రవాణా సమయంలో వాయు, శబ్ధ కాలుష్య నివారణకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇసుక, ఇతర ఖనిజాలు రవాణా చేసే ట్రక్కులపై తప్పనిసరిగా టార్పాలిన్ పట్టాలు కప్పాల్పిందేనని తేల్చిచెప్పింది. ఇసుక రవాణాకు వినియోగించే ట్రక్కులపై పట్టాలు కప్పే విధంగా రాష్ట్రంలో మైనింగ్కు అనుమతులు పొందిన కాంట్రాక్ట్ సంస్థలు జీసీకేసీ ప్రాజెక్ట్స్, ప్రతిమ ఇన్ఫ్రాకు తగిన ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. టార్పాలిన్ కప్పకుండా నిబంధనలు ఉల్లంఘించిన ట్రక్కులకు ఎంత పెనాల్టీ విధించాలనే అంశంపై తగిన సలహాలతో తదుపరి విచారణలో కోర్టు ముందుకు రావాలని అడ్వకేట్ జనర్(ఏజీ), అమికస్ క్యూరీకి సూచించింది. ఏ సమయంలో ఇసుక రవాణా ట్రక్కులు అనుమతించాలి అనే అంశంపైనా అమికస్ క్యూరీ, ఇతర ఇసుక రవాణా భాగస్వామ్య పక్షాలతో లోతైన సంప్రదింపులు అవసరమని ఏజీ చెబుతున్న నేపథ్యంలో ఈ అంశంపై తదుపరి విచారణలో తేలుస్తామని ప్రకటించింది. ఇసుక తవ్వకాలకు కాంట్రాక్ట్ పొందిన జీసీకేసీ ప్రాజెక్ట్స్, ప్రతిమ ఇన్ఫ్రాను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చింది. వారిరువురికీ నోటీసులు జారీచేసింది. విచారణను జూలై 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది. పల్నాడు జిల్లా, అమరావతి మండలం, ముత్తాయపాలెం గ్రామంపరిధిలో జయప్రకాశ్ వెంచర్స్ సంస్థ ఇసకను అక్రమంగా తవ్వి భారీ వాహనాలతో తరలిస్తోందని జీవీఎ్సఎస్ ప్రసాద్ మరో ఐదుగురు గతేడాది ఏప్రిల్లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గోవాలో ఇసుక అక్రమ రవాణా, కాలుష్య నివారణకు కృషి చేసిన న్యాయవాది నోర్మా అల్వారె్సను ధర్మాసనం అమికస్ క్యూరీగా నియమించింది. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి కోర్టుకు సహాయకారిగా వ్యవహరిస్తున్నారు. వీరు చేసిన పలు సూచనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఇప్పటికే ఎన్జీటీ సమగ్రంగా విచారించి, అక్రమ మైనింగ్ నివారణకు గతేడాది మార్చి 23న ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేసింది. ప్రస్తుతం అక్రమ మైనింగ్ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని గుర్తుచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa