ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాక్షస రాజ్యం పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 04:09 PM

తిరుమల శ్రీవారి దయ వల్ల ఏపీలో రాక్షస రాజ్యం పోయి రామ రాజ్యం రానున్నదని అనకాపల్లి టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోయి.. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఏపీలో భారీగా పోలింగ్ జరిగిందన్నారు. చాలా కాలం తరువాత పోలీసులు వారు సక్రమంగా విధులు వారు నిర్వర్తించారన్నారు. కొంత మంది పోలీసుల్లో ఇంకా మార్పు రావాల్సి ఉందని సీఎం రమేష్ తెలిపారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తే వైసీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతాయని పేర్కొన్నారు. ఏపీలో పోలీసుల రాజ్యం పోయి ప్రజల రాజ్యం వచ్చిందన్నారు. కేడర్‌ని ఉత్సాహ పరచ్చేందుకే జగన్ ఐప్యాక్.. బ్లూ ప్యాక్ అంటూ మభ్యపెడుతున్నాడన్నారని సీఎం రమేష్ పేర్కొన్నారు. ఇక ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఎంపీ సంతోష్ కుమార్, ఇన్ఫోసిస్ అధినేత సుధా నారాయణమూర్తి, చేవెళ్ళ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ తదితరులున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa