ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరూ గొడవలు, అల్లర్లకు పాల్పడవద్దని మదనపల్లె రూరల్ సీఐ సద్గురుడు, నిమ్మనపల్లె ఎస్ఐ లోకేశ్ రెడ్డి సోమవారం సూచించారు. నిమ్మనపల్లెలో వారు మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పార్టీల పేరుతో ఉద్రిక్తతలకు దారి తీసేలా గొడవలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పచ్చని పల్లెల్లో పగలు ప్రతీకారాలకు ఆజ్యం పోయకుండా ఐకమత్యంతో ఉండాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa