కౌంటింగ్ జరిగే సమయంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కూటమి అనంత అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఎన్నికల పోలింగ్ సమయంలో ఏజెంట్ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో... కౌంటింగ్లో మరింత ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు నియమనిబంధనలన్నీ తెలిసి ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకు చాలా ముఖ్యమని, ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్ ఉంటుందని, అనంత అర్బన నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేస్తారని అన్నారు. ఆ మేరకు అన్ని టేబుల్స్కు ఏజెంట్లు ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లో ఇనవాలిడ్ ఎక్కువగా ఉంటాయని, ఈ విషయంపై పూర్తి అవగాహనతో ఉండాలని అన్నారు. రెండు రోజుల్లో ఏజెంట్ల జాబితా సిద్ధం చేస్తామని అన్నారు. ఎన్టీఆర్ జయంతిని మంగళవారం అనంతపురం అర్బన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. శ్రీనగర్ కాలనీలో అనంత అర్బన నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఆ తర్వాత ప్రభుత్వాస్పత్రిలో అన్నదానం చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa