విజయవాడలో లాడ్జిలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యజమానుల్ని పోలీసులు అలర్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు, కౌంటింగ్ ఉండటంతో కొత్త వ్యక్తులు, నేర చరిత్ర గల వారికి, అనుమానాస్పద వ్యక్తులకు వసతి ఇవ్వొద్దని విజయవాడ సౌత్ ఏసీపీ రత్నరాజు సూచించారు. గవర్నర్పేట పోలీస్స్టేషన్ ఆవరణలో లాడ్జిలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యజమానులతో సమావేశం నిర్వహించి.. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పలు సూచనలు చేశారు.
నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అవకాశం లేకుండా.. ముందుగానే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏసీపీ. ఇప్పటికే అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచామని.. బయట నుంచి వచ్చిన వ్యక్తులు, అనుమానాస్పాద వ్యక్తులకు గదుల్ని అద్దెకు ఇవ్వొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తుల్ని గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అంతేకాదు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎలాలంటి ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే గవర్నర్పేట, హనుమాన్పేట, ఇతర ప్రాంతాల్లో లాడ్జీలు, హోటళ్లను పోలీసులు తనిఖీ చేశారు.. అక్కడ గదులు తీసుకున్నవారి వివరాలు సేకరించారు. నగరానికి రావడానికి కారణాలు.. ఇతర వివరాలు ఆరా తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa