రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం, ప్రజాస్వామ్యవాదులు అసహ్యించుకునే రీతిలో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తున్న వాతావరణం పూర్తిస్థాయిలో నెలకొందని కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కదిరిలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటమిని తట్టుకోలేక సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, వైసీపీ నిబంధనలు పాటించని పార్టీ అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు మారుపేరు అని అన్నారు. చట్టబద్ధంగా వెళ్దామని, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు ప్రేరేపించినా.. సయంమనం పాటించాలని సూచించారు. ఎన్నికల్లో గెలవబోతున్నామని, ప్రభుత్వంలో భాగస్వాములం కాబోతున్నామని, విజయాన్ని ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, వినియోగించుకునే విధంగా ఆలోచన చేద్దామని కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa